SGSTV NEWS online
Crime

రెండు రోజుల్లో కుమార్తె  వివాహం…



పిఠాపురం, , రెండు రోజుల్లో కుమార్తె వివాహం జరగనుండగా.. బుధవారం తండ్రి కావాటి చిన్నఏసు (45) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్సై లోకేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం స్థానికులు పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ సెంటర్ లోని డ్రెయినేజీలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సంఘటన ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. జగ్గయ్యచెరువు ప్రాంతానికి చెందిన చిన్నఏసుగా గుర్తించారు. మద్యం తాగి కాలువలో పడినట్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నారు. చిన్నఏసుకు అయిదుగురు కుమార్తెలుండగా 8న రెండో కుమార్తె వివాహం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లి ఇంట విషాదం అలముకోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also read

Related posts