స్నానం చేయనందుకు తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే బావిలో దూకగానే ప్రాణభయంతో కేకలు వేసింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత..
ఆసిఫాబాద్, మే 21: స్నానం చేయకుండా అదే పనిగా ఫోన్ చూస్తున్న కూతురిని ఓ తల్లి మందలించింది. అంతే మనస్తాపానికి గురై ఓ బాలిక బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో సమాయానికి సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం వెలుగు చూసింది. ఎస్హెచ్వో బాలాజీ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..
ఆసిఫాబాద్ పట్టణంలోని సందీప్నగర్లో స్వర్ణలత, పోచీరాం దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె సాత్విక (17) ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. ఈ ఏడాది సెకండ్ ఇయర్లోకి వెళ్లబోతుంది. అయితే బుధవారం ఇంట్లో కూర్చుని ఫోన్ చూస్తున్న సాత్వికను స్నానం చేయమని కుటుంబ సభ్యులు కాస్త గట్టిగా మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక.. కోపంతో పక్క వీధి బజార్వాడిలోని బావి వద్దకు పరుగెత్తుకు వెళ్లి అందులో దూకింది. అయితే ప్రాణ భయంతో బాలిక నీటిలో కొట్టుకుంటూ కేకలు వేయడంతో గమనించిన కాలనీవాసులు వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
స్పందించిన ఎస్హెచ్వో పోలీసులు వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసి సంఘటనా స్థలానికి తరలించారు. ఫైర్ ఫైటర్ నరేష్, ఫైర్మెన్ రాము, చోదకుడు ప్రవీణ్కుమార్లు తాడు సాయంతో బావిలో దిగి బాలికకు రక్షణ జాకెట్ తొడిగి బయటకు లాగారు. సకాలంలో స్పందించి బాలిక ప్రాణాలు కాపాడిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని కాలనీ ప్రజలు, ఉన్నతాధికారులు అభినందించారు. చిన్న విషయానికే బావిలో దూకిన బాలికకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటనలో బాలిక కాలికి గాయమవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Also read
- విశాఖ షీలానగర్లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?





