మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు ఓ ప్రభుత్వ ఉద్యోగిని మూతి పళ్ళు రాలగొట్టిన ఘటన పుల్లంపేటలో చోటు చేసుకుంది. పుల్లంపేటలో మద్యం సేవించి ఆటోతో స్కూటర్ ను ఢీకొన్న ముగ్గురు యువకులను మందలించిన వీఆర్వో సుబ్బరాయుడు పై ముగ్గురు యువకులు దాడి చేసి విచక్షణ రహితంగా మూతి పళ్ళు రాల గొట్టి గాయపరిచారు. వివరాల్లోకి వెళితే..
కడప, ఏప్రిల్ 30: కడప జిల్లా పుల్లంపేట మండలం అనాసముద్రం విఆర్వో సుబ్బరాయుడుపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన మూడు మూతి పళ్ళు రాలి పోయాయి. VRO భోజనం ముగించుకుని కార్యాలయం బయట రోడ్డు పక్కన స్కూటర్ ను ఆపి మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఆ సమయంలో కొందరు యువకులు మద్యం సేవించి ఆటోతో విఆర్వో సుబ్బ రాయుడు స్కూటర్ ను ఢీ కొన్నారు.
దీంతో ఆగ్రహించిన సుబ్బ రాయుడు ఏరా తాగి ఉన్నారా? అని మందలించాడు. మత్తులో ఉన్న యువకులు విఆర్వో సుబ్బరాయుడు పైదాడి చేశారు. ఈ దాడిలో విఆర్వో సుబ్బరాయుడు మూడు మూతి పళ్ళు రాలిపోవడంతో పాటు తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పుల్లంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
- నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..





