జాకెట్ విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి.. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గుత్తి మండలం జొన్నగిరి గ్రామంలో జాకెట్ కోసం రెండు కుటుంబాలు తలలలు పగిలేటట్టు కొట్టుకున్నారు. సుంకులమ్మ అనే మహిళ ఉతికి ఆరేసిన తన నాలుగు జాకెట్లు కనిపించకపోవడంతో వెతకటం..
అనంతపురం, మార్చి 19: జాకెట్ కోసం ఇరుగుపొరుగు వాళ్ళు తలలు పగిలేటట్టు కొట్టుకున్నారంటే ఎవరైనా నమ్ముతారా??? ఎస్… నిజంగానే జరిగింది. జాకెట్ విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి.. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గుత్తి మండలం జొన్నగిరి గ్రామంలో జాకెట్ కోసం రెండు కుటుంబాలు తలలలు పగిలేటట్టు కొట్టుకున్నారు. సుంకులమ్మ అనే మహిళ ఉతికి ఆరేసిన తన నాలుగు జాకెట్లు కనిపించకపోవడంతో వెతకటం మొదలుపెట్టింది. తన జాకెట్లు పక్కింట్లో ఉంటున్న శాంతమ్మ నందిని వద్ద కనిపించడంతో గొడవ మొదలైంది.
కాసేపటికి సుంకులమ్మ సోదరులైన లక్ష్మణ్ రాములు అక్కడికి వచ్చి.. పక్కింటి శాంతమ్మ నందినితో గొడవపడ్డారు. అలా మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. మరి కాసేపటికి పక్కింటి శాంతమ్మ, నందిని తరపున కుటుంబ సభ్యులైన చిన్నవీరప్ప, ఉరుకుందు, చిన్ని, వంశీ, సుంకులమ్మ, ఆమె సోదరులైన లక్ష్మణ్, రాముపై కర్రలు ఇనుపరాట్లతో దాడి చేశారు. దాడిలో లక్ష్మణ్, రాము తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇరు కుటుంబాలు ఘటనపై పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. జాకెట్ ఎంత పని చేసింది? సుంకులమ్మ ఆరేసిన జాకెట్లు… గాలికి పక్కింటి శాంతమ్మ ఇంట్లో పడడం ఏంటి??? ఆ జాకెట్ల కోసం ఇరుగింటి పొరుగు ఇంట్లో ఉంటున్న ఆ రెండు కుటుంబాలు తలలు పగలేటట్లు కొట్టుకోవడం ఏంటి??? అనుకుంటున్నారు స్థానికులు.
Also read
- భవన నిర్మాణ కార్మికుల కు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్పై తీసుకెళ్లి..
- విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
- ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్చేస్తే..
- అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..





