బొబ్బిలి : విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఓ విద్యార్థి మృతిచెందాడు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. సహ విద్యార్థి దాడి చేయడంతో 9వ తరగతి విద్యార్థి సుందరాడ కార్తీక్ కిందపడిపోయాడు. దీంతో అక్కడున్నవారు ఆ విద్యార్థిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థి మృతిచెందినట్లు తెలిపారు.
ఈ ఘటనపై కార్తీక్ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీశకుమార్ తెలిపారు. ఘర్షణకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
Also read
- Mahabubnagar: ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్
- Telangana: భార్య కామం.. మంత్రగాడి మోహం.. కట్ చేస్తే, భర్తను ఎలా లేపేశారో తెలుసా..?
- Vijayawada: ఉదయాన్నే జిమ్లో చాటుమాటు యవ్వారం.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది..
- Hyderabad: ఫామ్హౌస్లో 8 మంది మహిళలు, 23 మంది పురుషులు.. అర్థరాత్రి వేరే లెవల్ సీన్.. చివరకు
- Lawyer Kissing video: లైవ్లో మహిళకు లాయర్ ముద్దులు – కోర్టు మొత్తం షాక్