ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు మూడవరోజు యోగ శ్రీనివాసుని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఉభయదేవేరులతో కొలువై ఆలయ ప్రాంగణం, క్షేత్ర పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముందుగా ఆలయ ముఖమండపం వద్ద సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అర్చనాది కార్యక్రమాలను నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు హారతులను సమర్పించారు. ఆ తరువాత అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ చిన వెంకన్న సూర్య ప్రభవాహనంపై గ్రామంలో విహరించారు. పలువురు భక్తులు స్వామి, అమ్మ వార్లను దర్శించి తరించారు.
Also read
- విశాఖ షీలానగర్లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!
- ఆస్తి పిచ్చి.. 62 ఏళ్ల భర్తను భార్య ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
- Hyderabad: రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!
- Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..?





