SGSTV NEWS online
Andhra PradeshCrime

గోదావరి నదిలో స్నానానికి వెళ్లి బావబావమరిది మృతి



రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో మునిగి బావబావమరిది మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


రాజమహేంద్రవరంలోని యాదమ్మ దిబ్బకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దేవర శ్రీనివాస్, అనకాపల్లి జిల్లా సైపవరానికి చెందిన ఈపు నూకరాజు బావబావమరుదులు. సోమవారం వీరిద్దరూ పుష్కరఘాట్ వద్ద నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. లోతు గమనించక నదిలో దిగడంతో ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నూకరాజుకు కొన్ని రోజుల కిందటే వివాహమైందని బంధువులు తెలిపారు. నదీతీరంలో ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చి బావబావమరుదులు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also read

Related posts