రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో మునిగి బావబావమరిది మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజమహేంద్రవరంలోని యాదమ్మ దిబ్బకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దేవర శ్రీనివాస్, అనకాపల్లి జిల్లా సైపవరానికి చెందిన ఈపు నూకరాజు బావబావమరుదులు. సోమవారం వీరిద్దరూ పుష్కరఘాట్ వద్ద నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. లోతు గమనించక నదిలో దిగడంతో ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నూకరాజుకు కొన్ని రోజుల కిందటే వివాహమైందని బంధువులు తెలిపారు. నదీతీరంలో ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చి బావబావమరుదులు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also read
- గోదావరి నదిలో స్నానానికి వెళ్లి బావబావమరిది మృతి
- ఒకే రోజు గంటల వ్యవధిలో శవాలుగా మరిన వృద్ధ దంపతులు.. మిన్నంటిన రోధనలు
- జీడిమామిడి తోటలో ఏం జరిగింది..? శవాలుగా తల్లీకూతురు.. ఉలిక్కిపడ్డ ఏలూరు..
- పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి….. గ్రీష్మ కుమార్,సి.పి.ఐ.యం.యల్. (న్యూ డెమోక్రసీ)
- శివుని అష్టమూర్తి తత్వం అంటే ఏంటి? పరమేశ్వరుడు ఎక్కడెక్కడ వెలిశాడు?





