రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో మునిగి బావబావమరిది మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజమహేంద్రవరంలోని యాదమ్మ దిబ్బకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దేవర శ్రీనివాస్, అనకాపల్లి జిల్లా సైపవరానికి చెందిన ఈపు నూకరాజు బావబావమరుదులు. సోమవారం వీరిద్దరూ పుష్కరఘాట్ వద్ద నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. లోతు గమనించక నదిలో దిగడంతో ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నూకరాజుకు కొన్ని రోజుల కిందటే వివాహమైందని బంధువులు తెలిపారు. నదీతీరంలో ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చి బావబావమరుదులు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




