Hyderabad: హైదరాబాద్ శివారులోని ఐడీఏ
బొల్లారంలో దారుణమైన ఘటన జరిగింది. ఏం జరిగిందో తెలీదుగానీ.. భర్త కళ్ల ముందు దుండగులు భార్య గొంతు కోసి చంపేశారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి సైలెంట్గా పరారయ్యారు.అడ్డుకోబోయిన భర్తపైనా దాడి చేశారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
హైదరాబాద్ శివారులోని ఐడీఏ బొల్లారంలో దారుణమైన ఘటన
పోలీసులు చెబుతున్న వివరాల మేరకు బీహార్కు చెందిన అనిల్ కుమార్-మీనాదేవి దంపతులు ఐడీఏ బొల్లారం పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు. రాత్రి ఐడీఏ బొల్లారం పరిధిలో సంతకు దంపతులు వెళ్లారు. సంత తర్వాత తిరిగి టూ వీలర్ ఇంటికి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో అంటే గండిగూడెం క్రీడా ప్రాంగణం వద్ద బైక్ ఆగిపోయింది.
అప్పటికే అక్కడున్న దుండగులు చెట్ల పొదల్లోంచి బయటకు వచ్చారు. అనిల్ కుమార్పై దాడి చేసి అతడి భార్యను లాక్కెళ్లారు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ మీనాదేవి గొంతుకోసి పరారయ్యారు. అడ్డుకోబోయిన భర్తపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అటువైపు వస్తున్న స్థానికులు గాయపడిన అనిల్కుమార్ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఈలోగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడి ఫిర్యాదు నేపథ్యంలో ఐడీఏ బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ దారుణానికి తెగబడింది ఎవరు? ఎవరైనా తెలిసినవారా? లేకుంటే అనిల్ ఫ్యామిలీకి ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా? ఈ కేసు గురించి సమాచారం సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




