యర్రగొండపాలెం (ప్రకాశం) : యర్రగొండపాలెం పట్టణం లోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులతో ఆదివారం వంట పనులు చేయించారు. ఆ పాఠశాలలో 600 మంది దాకా విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. కాగా ప్రతి వారం ఏదో ఒక తరగతి నుంచి ఏడు నుంచి ఎనిమిది మంది విద్యార్థులతో వంట పని చేయిస్తునట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ ఆదివారం మెనూలో చపాతి ఉండగా విద్యార్థులతో 600 చపాతీలను చేయించిన్నట్లు విద్యార్థులు తెలిపారు. తమతో వంట సిబ్బంది బలవంతంగా వంట పనులు చేయిస్తున్నారని కొందరు విద్యార్థులు చెబుతుండగా తామే ఆదివారం కావడంతో వంటవారికి సాయం చేస్తున్నామని మరికొందరు అంటున్నారు. కాగా ఇలా విద్యార్థులతో వంట పనులు చేయించడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు
Also read :
- Vat Savitri Vrat 2026: అఖండమైన సౌభాగ్యం కోసం వట సావిత్రి వ్రతం.. ఈ ఏడాది ఖచ్చితమైన తేదీ, శుభ సమయం ప్రాముఖ్యత ఇదే!
- బాబోయ్..బట్టలు లేకుండా స్నానం చేస్తున్నారా..
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఎంత పనిచేశావ్ కిరణ్మయి.. లవర్ రీఛార్జ్ చేయలేదని ఏం చేసిందంటే..
- ఫిట్స్ అని డ్రామా.. కట్ చేస్తే సీసీటీవీతో వెలుగులోకి అసలు నిజం.. అదేంటంటే!





