కపిలేశ్వరపురం : అంబేద్కర్ కోనసీమ జిల్లా కపీలేశ్వర పురం మండలం కేదార్లంక శివారు వీధి వారి లంక గ్రామానికి చెందిన కాశీ జ్యోతి (38) అనే మహిళ అబూదబీలో ఇబ్బందులు పడుతున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపింది. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు గతంలో కూడా గల్ఫ్ వెళ్లిన ఈమె మరోసారి తన కుటుంబ ఆర్ధిక ఇబ్బందులు నేపథ్యంలో నాలుగు నెలల క్రితం పి.గన్నవరం కు చెందిన ఒక ఏజెంట్ ద్వారా అరబ్ షేక్ ఇంట్లో పనిచేసేందుకు అబూదబీ(దుబాయ్ )వెళ్ళింది. అక్కడ సరైన వసతులు లేకపోవడం ఇంటి సాకిరి మొత్తం తానే చేయాల్సి రావడంతో తనకు ఆరోగ్యం క్షీణించిందని, కనీసం తనను సరిగా తిండి పెట్టకుండా పనులు చేయించుకుంటున్నారని ఆమె తెలిపింది. తన ఆరోగ్యం క్షీణించిందని చెప్పినప్పటికీ పట్టించుకోకుండా పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు వీడియో ద్వారా తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తనను స్వదేశమైన ఇండియాకు రప్పించాలంటూ వేడుకుంటుంది. కాగా బాధితురాలు జ్యోతికి వీధివారి లంకలో లైటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భర్త చంద్రశేఖర్, ఇంటర్మీడియట్ చదువుతున్న 18 సం.లు, 16 సం.లు, చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమె పుట్టిల్లు అంబాజీపేట మండలం మాచవరం కాగా ఆమె తల్లిదండ్రులు, జ్యోతి కోసం పిల్లలు, భర్త ఎదురుచూస్తున్నారు. తన తల్లిని వెంటనే తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




