మండల పరిధిలోని నాయుడుపాళెంకు చెందిన తెదేపా సీనియర్ నాయకుడు బండ్ల సురేంద్రపై స్థానిక వైకాపా నాయకులు దాడులు చేయడంతో తీవ్రగాయాలయ్యాయి.
కొడవలూరు: మండల పరిధిలోని నాయుడుపాళెంకు చెందిన తెదేపా సీనియర్ నాయకుడు బండ్ల సురేంద్రపై స్థానిక వైకాపా నాయకులు దాడులు చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు… తెదేపా సీనియర్ నాయకులు బండ్ల సురేంద్ర గురువారం సాయంత్రం కొడవలూరు తహసీల్దారు కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్నారు. నాయుడుపాళెం వద్ద జాతీయ రహదారిపై కాపు కాసిన మోహన్, జనార్దన్, మల్లికార్జున, తదితరులు మూకుమ్మడిగా దాడులు చేశారు. మా పొలాలు కొలిపిస్తావా అని దుర్భాషలాడారు. స్థానికులు 108కు ఫోన్ చేయగా కోవూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్సకోసం నెల్లూరుకు తరలించారు. సీఐ కోటిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Also read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్లో.. భార్య కడపలో.. డ్రైవర్తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





