SGSTV NEWS online
Andhra PradeshCrime

విశాఖలో దారుణం.. చున్నీతో భర్త హత్య.. ఆపై వడదెబ్బంటూ డ్రామా


విశాఖపట్నంలోని భీమిలి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య నాగమణి భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసింది. ఆ తర్వాత వడదెబ్బ కారణంగా పడిపోయాడంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది.

విశాఖపట్నంలోని భీమిలి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వడదెబ్బ ముసుగులో ఓ భార్య తన భర్తను దారుణంగా హత్య చేసింది. భార్య నాగమణి భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసింది. ఆ తర్వాత వడదెబ్బ కారణంగా పడిపోయాడంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే నాగమణిని అరెస్టు చేశారు. అయితే ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయా? లేదా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ పనికి పాల్పడిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also read

Related posts