*వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు..*
ఏప్రిల్ 8వతేదీన అర్ధ రాత్రి సమయంలో *కేసముద్రం మెయిన్ రోడ్ లోని ఏ మార్ట్ పక్కన గల మహాలక్ష్మిట్రేడర్స్ కంపెనీలో* దొంగతనం జరగగా.., అట్టి విషయంలో ఈరోజు ఉదయం బోడమంచ్యతండ సమీపంలో వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో దొంగతనం చేసిన నేరస్తుడు *గుగులోతు నవీన్* s/o నాందేవ్(22) r/o రతిరాంతండ, నెల్లికుదురు మండలం అను వ్యక్తిని పట్టుకొని అతని నుండి *ఐదులక్షల రూపాయలకు పైగా నగదు, కొత్త పల్సర్ బైక్, రెండు బంగారం రింగులు, ఒక వెండి బ్రాస్లెట్, ఒక మొబైల్ ఫోను* స్వాధీనపరచుకొని అట్టి దొంగను ఈరోజు రిమాండ్ కు తరలించడం జరుగుతుందని *డిఎస్పీ తిరుపతిరావు* తెలిపారు.
ఈ…దొంగతనం కేసు విషయంలో ప్రతిభ కనబరిచిన *మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు, రూరల్ సిఐ సర్వయ్య, సిసిఎస్ సిఐ హాతిరం, సీసిఎస్ ఎస్ఐ తహేర్ బాబా, కేసముద్రం ఎస్ఐ మురళీధర్, కరుణాకర్, రాం చందర్,* మరియు కానిస్టేబుల్ లను *జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్* అభినందించారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..