*వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు..*
ఏప్రిల్ 8వతేదీన అర్ధ రాత్రి సమయంలో *కేసముద్రం మెయిన్ రోడ్ లోని ఏ మార్ట్ పక్కన గల మహాలక్ష్మిట్రేడర్స్ కంపెనీలో* దొంగతనం జరగగా.., అట్టి విషయంలో ఈరోజు ఉదయం బోడమంచ్యతండ సమీపంలో వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో దొంగతనం చేసిన నేరస్తుడు *గుగులోతు నవీన్* s/o నాందేవ్(22) r/o రతిరాంతండ, నెల్లికుదురు మండలం అను వ్యక్తిని పట్టుకొని అతని నుండి *ఐదులక్షల రూపాయలకు పైగా నగదు, కొత్త పల్సర్ బైక్, రెండు బంగారం రింగులు, ఒక వెండి బ్రాస్లెట్, ఒక మొబైల్ ఫోను* స్వాధీనపరచుకొని అట్టి దొంగను ఈరోజు రిమాండ్ కు తరలించడం జరుగుతుందని *డిఎస్పీ తిరుపతిరావు* తెలిపారు.
ఈ…దొంగతనం కేసు విషయంలో ప్రతిభ కనబరిచిన *మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు, రూరల్ సిఐ సర్వయ్య, సిసిఎస్ సిఐ హాతిరం, సీసిఎస్ ఎస్ఐ తహేర్ బాబా, కేసముద్రం ఎస్ఐ మురళీధర్, కరుణాకర్, రాం చందర్,* మరియు కానిస్టేబుల్ లను *జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్* అభినందించారు.
Also read
- నన్ను చంపాలని అనేకసార్లు ప్రయత్నించారు.. జోగి రమేష్ కోడలు మేఘన
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..





