*
నగరంలో దీపిక ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ యువతిపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఈనెల 6న అనారోగ్యంతో బాధపడుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన సదరు యువతిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో హాస్పిటల్లోనే పనిచేస్తున్న దక్షిణామూర్తి (23) అనే యువకుడు ఆమెకు తెలియకుండా ముత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు., సిపి మాట్లాడుతూ మహారాష్ట్ర సిరోంచ కు చెందిన దక్షిణామూర్తి ఆసుపత్రి OT లో టెక్నీషియన్ గా పని చేస్తున్నడనీ, అత్యాచారం చేసే ముందు సీసీ కెమెరాలో రికార్డ్ కాకుండా వాటిపై పరదా వేశాడని, మద్యం సేవించి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, అతని మొబైల్ ఫోన్ లో కూడా అశ్లీల చిత్రాలు కూడా లభ్యమయ్యాయనీ తెలిపారు.
Also read
- ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం, నమ్మకాలు చెప్పేదేమిటి?
- పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబితాలో ఉందా?
- నేటి జాతకం లు 14 జూన్, 2026
- కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్కు తీసుకెళ్లి..
- మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..





