హైదరాబాద్: సరూర్నగర్ పరిధి భగత్ సింగ్ నగర్ బస్తీలో కంట్రీమేడ్ తుపాకీతో హల్చల్ చేస్తున్న ఇమ్రాన్ అలియాస్ ఇబ్బు అనే పాతనేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్ఓటీ, సరూర్ నగర్ పోలీసులు దాడి చేయగా ఆటోడ్రైవర్గా పనిచేస్తున్న ఇమ్రాన్ వద్ద నాటు తుపాకీ, ఒక లైవ్ రౌండ్ లభించాయి.
అదుపులోకి తీసుకుని విచారించగా.. ఇతడి స్వస్థలం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం జంపాక గ్రామం అని తేలింది. నగరానికి వచ్చి చెడు అలవాట్లకు బానిసై నేరాల బాటపట్టాడని తెలిసింది. రాజేంద్రనగర్ లోని ఓ స్క్రాప్ దుకాణంలో పని చేసిన సమయంలో బిహార్కు చెందిన షకీర్ వద్ద కంట్రీమేడ్ తుపాకి, ఒక లైవ్తోండ్ రూ.40 వేలకు కొనుగోలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇమ్రాన్పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో 17 కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
Also read
- పల్నాడులో హత్య.. గోవాలో జాడ..! నిందితుల కోసం పోలీసుల షాకింగ్ ఆపరేషన్!
- కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్.. అతనితో ఆమెకి కూడా వివాహేతర బంధం! అనకాపల్లిలో ఘోరం..
- ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య! కారణం..?
- జలుబు చేసిందని RMP డాక్టర్ దగ్గరికి వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయ్!
- సిని ఫక్కీలో చేజింగ్.. చైన్ స్నాచర్లను పట్టుకున్న సరిహద్దు గ్రామస్తులు..! మహిళ సహా..





