SGSTV NEWS online
CrimeTelangana

అదేం పనిరా నాయనా.. భార్య కాపురానికి రావడం లేదని భర్త ఏం చేశాడంటే..





Telangana: భార్య కాపురానికి రావడం లేదని ఓ అల్లుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్య, కన్నబిడ్డలు, అత్తమామలు ఉన్న ఇంటికి అర్ధరాత్రి వేళ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అంతటితో ఆగకుండా భార్యకు వీడియో కాల్ చేసి లైవ్‌లో ఆ దారుణాన్ని చూపించాడు. ఈ షాకింగ్ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హత్నూర మండలం దౌలాపూర్ గ్రామంలో అర్థరాత్రి పెద్ద ప్రమాదం తప్పింది.


మద్యం మత్తు అదనపు కట్నం వేధింపులు. చివరకు కన్నపిడ్డలను, భార్యను సజీవ దహనం చేసే స్థాయికి అతన్ని దిగజార్చాయి. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్ గ్రామానికి చెందిన నాగరాజుకు, దౌలాపూర్ గ్రామానికి చెందిన లావణ్యతో 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లైన కొంతకాలానికే నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. అదనపు కట్నం తేవాలంటూ భార్య లావణ్యను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు.

Also read

Related posts