శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుకొండలో విషాదం చోటుచేసుకుంది. గంగాధర్ అనే 46 ఏళ్ల వ్యక్తి ఇంట్లో ఖర్జూరం తింటుండగా, విత్తనం గొంతులో ఇరుక్కుని ఊపిరాడక మరణించారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శ్రీ సత్య సాయి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గొంతులో ఖర్జూరం ఇరుక్కుని 46ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. పెనుకొండ పట్టణానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఇంట్లో ఖర్జూర పళ్ళు తింటున్నాడు. అలా ఖర్జూర పండ్లు తింటుండగా పొరపాటున విత్తనం గొంతులోకి వెళ్ళింది.. గొంతులో ఖర్జూర విత్తనం ఇరుక్కోవడంతో గంగాధర్ కు ఊపిరాడలేదు… దీంతో వెంటనే కుటుంబ సభ్యులు గంగాధర్ను పెనుకొండలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అనంతపురం తీసుకువెళ్లాలని డాక్టర్లు సూచించారు…. గొంతులో ఖర్జూర విత్తనం ఇరుక్కుని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న గంగాధర్ ను కుటుంబ సభ్యులు అనంతపురం తీసుకెళుతుండగా మార్గ మధ్యలోనే అతడు మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పెనుకొండ పట్టణంలో గంగాధర్ కార్ ట్రావెల్స్ నడిపిస్తున్నాడు. గొంతులో ఖర్జూర విత్తనం ఇరుక్కుని ఊపిరి ఆడక గంగాధర్ చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఇటీవల గొంతు సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఇంట్లో ఖర్జూరం తింటుండగా విత్తనం పొరపాటున ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది. దీంతో ఊపిరాడలేదు. కుటుంబ సభ్యులు హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి పట్టణంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
Also Read
- వాచ్మెన్ దారుణ హత్య.. సీసీ కెమెరాల్లో రికార్డైన భయానక దృశ్యాలు..!
- శ్రీశైలంలో విషాదం.. అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య!
- పాము కాటుకు నాటు వైద్యం.. పరిస్థితి విషమించి యువకుడి మృతి..!
- AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు..
- Raksha Bandhan: తొలిసారి రాఖీ ఎవరు ఎవరికి కట్టారు? పురాణాల్లోని ఆసక్తికరమైన కథలు





