తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి అంశం రాజకీయాలు లేదా ఏ మతాన్నీ లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించినది కాదని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది విశ్వాసం, జవాబుదారీతనానికి సంబంధించినదని ఆయన చెప్పారు
అమరావతి, ఫిబ్రవరి 7: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నకిలీ నెయ్యి వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలో సదరు వీడియో పోస్ట్ చేశారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి అంశంపై సీబీఐ–సిట్(Special Investigation Team) దర్యాప్తు నివేదికల గురించి పవన్ ఈ వీడియోలో వివరించారు
ఈ అంశం రాజకీయాలకు లేదా ఏ మతాన్నీ లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించినది కాదన్న పవన్.. ఇది విశ్వాసం, జవాబుదారీతనానికి సంబంధించినదని అన్నారు. ఈ విషయంలో ప్రమేయం ఉన్నవారిని చట్ట ప్రకారం జవాబుదారీగా చేస్తారని.. న్యాయం జరిగే వరకూ ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయాన్ని కొనసాగిస్తుందని పవన్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్కు వెళ్లింది.. కట్చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




