ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారు.. కట్ చేస్తే.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయలుదేరారు.. ఇంతలోనే ఊహించని సీన్ ఎదురయ్యింది.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అసలేం జరిగిందంటే.. విజయవాడకు చెందిన ఓ ప్రేమ జంటను శుక్రవారం తిరుచానూరు పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన సాంబశివరావు, అలేఖ్య ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఈ క్రమంలోనే.. ఇద్దరూ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు.. అనంతరం ప్రేమ వివాహం చేసుకున్నారు.
అలేఖ్య ఆచూకీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. సాంబశివరావు, అలేఖ్య ఒక్కచోటనే ఉన్నారన్న విషయం తెలిసింది. వారు.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్తున్నట్లు భవానీపురం పోలీసులకు సమాచారం అందింది.. వెంటనే.. భవానీపురం పోలీసులు తిరుచానూరు పోలీసులను అప్రమత్తం చేశారు. ఇద్దరి గురించి సమాచారం అందించారు.. వాహనంలో అలేఖ్య, సాంబశివరావు ఇద్దరూ వస్తుండగా పోలీసులు తిరుచానూరు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భవానీపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా.. తాము ప్రేమించి పెళ్లిచేసుకున్నట్లు అలేఖ్య సాంబశివరావు తెలిపారు. తాము ఇద్దరం 11 ఏళ్లుగా ప్రేమించుకున్నట్లు అలేఖ్య తెలిపింది.. మేజర్లమైన తాము ఇష్టప్రకారమే వివాహం చేసుకున్నామని, పోలీసులు రక్షణ కల్పించాలంటూ కోరారు..
తిరుచానూరు సీఐ సునీల్కుమార్ మాట్లాడుతూ.. వీరిద్దరిని భవానీపురం పోలీసులకు అప్పగిస్తామని తెలిపారు. కాగా.. నూతన వధూవరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది
Also read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





