మియాపూర్: తొమ్మిది అంతస్తుల భవనంపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ దుర్గా రామ లింగ ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మియాపూర్ మయూరినగర్ కాలనీ, దివ్యశ్రీ శక్తి అపార్ట్మెంట్లో భర్త నెహ్రూ, కుమారుడితో కలిసి ఉంటున్న సాయి సింధూర(29) సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుంది.
శుక్రవారం మధ్యాహ్నం అపార్ట్మెంట్ తొమ్మిదో అంతస్తు నుంచి కిందికి దూకడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సాయి సింధూర మన స్తానికిలోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా ప్రస్తుతం ఆమె ఆరు మాసాల గర్భవతి అని తెలిసింది. మృతురాలి తండ్రి సూర్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- లలితా సహస్రనామం పుట్టిన మహిమ గల క్షేత్రం ఎక్కడ ఉంది తెలుసా?
- యామాలోక ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఆరో పట్టణం క్రౌంచపురం – ఆత్మ ప్రయాణం అత్యంత కఠినం, వేదనాభరితమట.
- ఆ.. ఇంట్లో ఏమైందో?
- దంపతుల మధ్య గొడవ.. కొడవలితో దాడి చేసిన భార్య.. భర్త మృతి





