మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. ఇద్దరు యువకుల అరెస్టు
మహబూబ్ నగర్ : ప్రేమ జంటను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు యువకులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ గ్రామీణ సీఐ గాంధీనాయక్ కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలానికి చెందిన యువకుడు, బాలిక(17)మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని పిల్లిగుండుతండా వద్ద ఉన్న అటవీ ప్రాంతానికి శుక్రవారం వచ్చారు. వీరు అటవీ ప్రాంతంలోకి వెళ్లగానే అక్కడ కూలి పనులు చేస్తున్న అశోక్ కుమార్ (26), లక్ష్మణ్(27) గమనించారు. కొద్దిసేపటి తర్వాత వారిని పట్టుకొని బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ యువకుడు తన వద్ద డబ్బులు లేవని చెప్పినా వినలేదు. బెదిరించడంతో తన స్నేహితుడికి ఫోన్చేసి రూ.6,500 నిందితులకు ఫోన్పే చేయించాడు. తర్వాత యువకుడి ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పగా ఆమె హన్వాడ పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి శనివారం అరెస్టు చేసి రిమాండు తరలించారు.
Also read
- చిట్టీల పేరిట రూ.2 కోట్ల మోసం.. మీర్పేట పోలీసులకు ఫిర్యాదు
- ప్రేమ జంటను బెదిరించి బాలికపై అత్యాచారం
- ఏం కష్టం వచ్చిందో..!
- భార్య మరొక పురుషునితో.. తట్టుకోలేక భర్త..
- Devotional :నవగ్రహ ప్రధాక్షణలు
చేసేటప్పుడు ఈ పద్ధతి పాటిస్తున్నారా……….?





