SGSTV NEWS online
CrimeTelangana

చిట్టీల పేరిట రూ.2 కోట్ల మోసం.. మీర్పేట పోలీసులకు ఫిర్యాదు



బాలాపూర్: చిట్ ఫండ్ పేరుతో కాలనీవాసులను మోసం సంఘటన హైదరాబాద్ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ నారాయణపురం వైష్ణవి కాలనీలో చోటుచేసుకుంది. వెంకట సాయి చిట్ ఫండ్స్ పేరుతో వైష్ణవి కాలనీ అధ్యక్షుడు సురేష్ కుమార్, అతని భార్య గత పదేళ్లుగా చిట్టీలు నిర్వహిస్తూ, ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించారని బాధితులు పేర్కొన్నారు. కాలనీవాసుల ప్రకారం, సుమారు 25 మందికి పైగా బాధితులు రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీలో పెట్టుబడి పెట్టారు. చిట్టీ గడువు ముగిసిన తరువాత కూడా వారికి డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి కాలయాపన చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరికొందరు కూడా ఇలాగే మోసపోయారని, మొత్తం వ్యవహారంలో దాదాపు రూ.2 కోట్లు వరకు మోసం చేశారని బాధితులు చెబుతున్నారు.

Also read

Related posts