పరకాల: ప్రియుడితో కలిసి భర్తను చంపించిన కేసులో భార్యతోపాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో హనుమకొండ జిల్లా పరకాలలో లావణ్య అనే మహిళ తన భర్త సుమన్ (35)ను హత్య చేయించిన సంఘటన రెండ్రోజుల క్రితం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సోదరుడు రాజు, ప్రియుడు నరేశ్తో కలిసి భర్తను చంపించినట్లు పోలీసులు నిర్ధరించారు. హత్య అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు గుర్తించారు. భర్తను చంపేందుకు రూ.5 లక్షలకు సుఫారీకి ఒప్పించినట్లు పోలీసులు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
పరకాల పట్టణానికి చెందిన మడికొండ సుమన్ (35) స్థానిక ఓ రెస్టారెంట్లో పని చేస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. భార్య లావణ్య కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన ఒకరితో వివాహేతర సంబంధం పెట్టుకోగా దీనిపై పలుమార్లు ఇంట్లో గొడవలు జరిగాయి. కొద్ది రోజుల కిందట లావణ్య భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లిలోని తన పుట్టింటికి వెళ్లారు. ఈ నెల 3న సుమన్ కనిపించకుండా పోయారు. ఆయన తండ్రి సాంబయ్య నాలుగైదు రోజులపాటు ఎక్కడ వెతికినా కొడుకు ఆచూకీ లభించకపోవడంతో 8న పరకాల పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేశారు. చివరకు భార్య లావణ్యపై పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ నెల 4న కొందరితో కలిసి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దయ్యాలవాగు సమీపంలో సుమన్ పై పెట్రోల్ పోసి చంపినట్లు తేలింది.
Also read
- జూదమాడుతూ పట్టుబడిన మహిళలు
- ప్రియుడితో కలిసి భర్త హత్య.. నలుగురి అరెస్టు
- కంటిపాపలను చిదిమేసి.. తానూ వెళ్లిపోయింది
- పెరుగు తెచ్చిన తంటా.. భర్తపై అలిగి వెళ్లిపోయిన భార్య
- పోస్టుమార్టం రిపోర్ట్తో వెలుగులోకి వచ్చిన నిజం.. ఆత్మహత్య కాదు హత్య!





