పెడన: కృష్ణా జిల్లా పెడన మండలం దక్షిణ తెలుగుపాలెంలోని ఓ ఇంట్లో జూదం ఆడుతూ నలుగురు మహిళలు పట్టుబడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మరో ఇద్దరు వ్యక్తులతో కలిపి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దక్షిణ తెలుగుపాలెంలో ఓ ఇంట్లో జూదం ఆడుతున్నారని మచిలీపట్నంలోని స్పెషల్ బ్రాంచికి సమాచారం అందగా.. వారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో సిబ్బంది అక్కడికి చేరుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.47,750 స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఈ నలుగురు మహిళలు స్థానిక పైడమ్మ కాలనీలో జూదమాడుతూ పట్టుబడ్డారని.. అందులో ఇద్దరిపై గతంలో 9 కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి మచిలీపట్నం కోర్టులో హాజరుపర్చగా.. సొంత పూచీకత్తుపై విడుదల చేస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
Also read
- జూదమాడుతూ పట్టుబడిన మహిళలు
- ప్రియుడితో కలిసి భర్త హత్య.. నలుగురి అరెస్టు
- కంటిపాపలను చిదిమేసి.. తానూ వెళ్లిపోయింది
- పెరుగు తెచ్చిన తంటా.. భర్తపై అలిగి వెళ్లిపోయిన భార్య
- పోస్టుమార్టం రిపోర్ట్తో వెలుగులోకి వచ్చిన నిజం.. ఆత్మహత్య కాదు హత్య!





