మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణా, మార్చి 19 మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మచిలీపట్నం ఇన్చార్జి డీఎస్పీ కె. ధర్మేంద్ర, ఆర్పేట సీఐ ఏసుబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన పూజారి రఘు (41) ఇంట్లో ఒక కుటుంబం అద్దెకు ఉంటుంది. వాళ్లకు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ఉంది.
ఆ అమ్మాయిని ప్రలోభపెట్టి రఘు మూడుసార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆ బాలిక నీరసంగా ఉండటం అనారోగ్యానికి గురవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకెళ్లగా గర్భవతి అని తేలింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు కూతురిని నిలదీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ విషయంపై మచిలీపట్నం ఆర్పేట పోలీసులకు తల్లిదండ్రులు ఈ నెల 18వ తేదీన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకుని అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
Also read
- తెలంగాణ టు కర్ణాటక.. అర్థరాత్రి ఇదేం పనిరా..? పోలీసులు ఛేజ్ చేస్తుంటే.. వాళ్లు ఏం చేశారంటే
- Tenali: సుడి మారాలని గోల్డ్ షాపును కొల్లగొట్టిన దొంగలు.. లోపల వారికి దొరికింది ఏంటో తెలుసా..?
- సాయికృష్ణ ఎక్కడ?.. విజయవాడ స్వర్గపురి పరిసరాల్లో సీసీ ఫుటేజీ పరిశీలన
- శవాలపై పేలాలు ఏరుకునే కక్కుర్తి.. మృత ఉద్యోగి కుటుంబం నుంచి లంచం అడిగి బుక్కైన జీవీఎంసీ అధికారి
- ఫేస్వాష్ కావాలంటూ షాప్లోకి వచ్చాడు.. ఇచ్చేందుకు వెనక్కి తిరిగిన మహిళ.. అంతే వెనుక నుంచి..




