SGSTV NEWS online
Andhra PradeshCrime

బాలికపై అత్యాచారం..! ఆ తర్వాత ఏం జరిగిందంటే.?




మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణా, మార్చి 19  మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మచిలీపట్నం ఇన్‌చార్జి డీఎస్పీ కె. ధర్మేంద్ర, ఆర్‌పేట సీఐ ఏసుబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన పూజారి రఘు (41) ఇంట్లో ఒక కుటుంబం అద్దెకు ఉంటుంది. వాళ్లకు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ఉంది.



ఆ అమ్మాయిని ప్రలోభపెట్టి రఘు మూడుసార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆ బాలిక నీరసంగా ఉండటం అనారోగ్యానికి గురవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకెళ్లగా గర్భవతి అని తేలింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు కూతురిని నిలదీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ విషయంపై మచిలీపట్నం ఆర్‌పేట పోలీసులకు తల్లిదండ్రులు ఈ నెల 18వ తేదీన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకుని అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

Also read

Related posts