చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై విజయవాడ కొత్తపేట పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ లంబాడీపేట ప్రాంతానికి చెందిన బాలిక తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందాడు. తల్లి ఓ హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. స్థానికంగా కారు నడుపుతూ జీవనం సాగించే హేమంత్ నాగసాయి (23) ఆ బాలికకు పరిచయమై ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. బాలిక తల్లి ఇంట్లోలేని సమయంలో బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. కొద్దిరోజులుగా బాలికకు ఒంట్లో బాగోకపోవడంతో తల్లి ప్రశ్నించగా.. బాలిక జరిగిన విషయం చెప్పింది. అనంతరం బాలిక కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హేమంత్ నాగసాయిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Also read
- ఓర్నీ దుంపదెగ.. SIR వెరిఫికేషన్ పేరిట వచ్చి పుస్తెల తాడు తెంపుకుపోయిండ్రు!
- Ananthagiri Hills: అనంతగిరిలో ట్రెక్కింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ.. ఆ తర్వాత నిమిషాల్లోనే..
- భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..
- కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..! క్రైమ్ స్టోరీని మించిన స్కెచ్..
- ఆరు హత్యకేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతి





