ఊర్కొండ, కుంటలో ఈతకు దిగిన పిల్లల్ని మృత్యువు కబళించింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డి, రజిని దంపతులకు కుమార్తె సిరి(14), కుమారుడు శ్రీమాన్షు(12)…, శ్రీకాంత్ సోదరి చంద్రకళకు కుమార్తె స్నేహ(17) సంతానం. హైదరాబాద్ లో స్నేహ ఇంటర్, సిరి పదోతరగతి, శ్రీమాన్షు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. శ్రీకాంత్ తల్లికి అనారోగ్యంగా ఉండటంతో పాటు, సెలవులు రావడంతో ఈ ముగ్గురూ గ్రామానికి వచ్చారు. గ్రామ శివారున ఉన్న పొలానికి శ్రీకాంత్తోతో పాటు వెళ్లారు. సరదాగా గడిపారు. పిల్లలు ముగ్గురూ సమీపంలోని కుంటలో ఈతకు దిగి మునిగిపోయారు. కాపాడాలని పిల్లలు కేకలు పెడుతున్నా ఈత రాని శ్రీకాంత్రెడ్డికి ఏం చేయాలో పాలుపోలేదు. వడివడిగా వెళ్లి సమీపంలోని రైతుల్ని తీసుకొచ్చి వారిని బయటకు తీసేసరికే ముగ్గురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
Also read
- రోడ్డు దాటుతుండగా విషాదం..!
- ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య
- అమ్మా.. నా మనసు విరిగిపోయింది!
- భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం
- కోస్తా జిల్లాలపై కన్నేసిన కంత్రీ గ్యాంగ్.. సర్కార్ ఎక్స్ప్రెస్ కేసులో షాకింగ్ ట్విస్ట్!





