ఇద్దరు వ్యక్తులు.. ఆటో నిండా ఏవో తీసుకుని వస్తున్నారు.. అనుమానం రావడంతో అధికారులు ఆటోను ఆపారు.. పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో వారిని అదుపులోకి చెక్ చేశారు.. ఆటోలో ప్రత్యేక అర ఏర్పాటు చేసుకుని.. తాబేళ్లు స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు నిర్ణయానికి వచ్చారు.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భారీగా తాబేలు పట్టుబడిన సంఘటన అల్లూరి జిల్లా చింతూరు ఏజన్సీలో చోటుచేసుకుంది. రావులపాలెం నుండి వడిసాకు అక్రమంగా తరలిస్తున్న తాబేలను అటవీశాఖ అధికారులు గుర్తించి అడ్డుకున్నారు. చింతూరు మండలం తులసిపాక ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తాబేలు తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాబేళ్ల రవాణాకు అనువుగా ఉండేలా తయారుచేసిన ఆటోలో 248 తాబేలను గోనె సంచుల్లో మూటలు కట్టి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పట్టుబడ్డ తాబేళ్లలో 18 తాబేలు మృతి చెందగా మిగిలిన 230 తాబేలు సోకిలేరు వాగులో విడిచిపెట్టారు. అక్రమంగా తాబేలును తరలిస్తే కఠిన చర్యలు తప్పవంటూ అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. తాబేళ్లు ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు.. ఎవరి కోసం తరలిస్తున్నారన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు
Also Read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





