తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని తండ్రిని కుమారుడు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాలో సోమవారం చోటు చేసుకుంది.
చందుర్తి, : తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని తండ్రిని కుమారుడు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జటోతు తిరుపతి (43) తాగుడుకు బానిసయ్యారు. తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవారు. మూడు రోజుల క్రితం ఇంట్లో ఉన్న రూ.పది వేలు తీసుకెళ్లారు. సోమవారం వచ్చి మళ్లీ డబ్బులు కావాలని భార్య అమీనాతో గొడవకు దిగారు. ఆమె ఈ విషయాన్ని తమ కుమారుడు రాజేశ్కు ఫోన్లో తెలిపింది. కారులో వచ్చిన రాజేశ్.. ఇంటి ముందు తల్లితో గొడవ పడుతున్న తండ్రిని కారుతో ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన తిరుపతిని స్థానికులు 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఈ మేరకు మృతుడి అన్న రాములు నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
మరోవైపు తిరుపతిపై గతంలో చందుర్తి ఠాణాలో మూడు కేసులు ఉన్నట్లు తెలిసింది.
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





