సాంబార్ విషయంలో దంపతుల మధ్య జరిగిన వివాదం భార్య మృతికి దారితీసింది. ఈ దారుణ సంఘటన కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని దేవనహళ్లి తాలూకా సావకనహళ్లి గ్రామానికి చెందిన నాగరత్న అనే మహిళ అనుమానాస్పద స్థితిలో ఇంట్లోనే శవమై కనిపించింది. నాగరత్నం ఇంట్లోనే ఉరివేసుకుని మరణించినట్టుగా ఆమె భర్త, పిల్లలు చెబుతున్నారు. అంతకు ముందు ఇద్దరి మధ్య సాంబార్ విషయంలో వాగ్వాదం జరిగిందని, దాంతో మనస్తాపానికి గురైన నాగరత్నం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విశ్వనాథ్పుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇదిలా ఉంటే, తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, హత్య అని ఆరోపించారు మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. ఆర్థిక సమస్యలతోనే తన భర్త ఈ హత్య చేశాడని మృతురాలి సోదరుడు, తల్లి ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ ఆమె భర్త, పిల్లలు సాంబార్ విషయంలో గొడవపడి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ఈ మేరకు ఇరువురి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నాగరత్నం మర్డర్ మిస్టరీని చేధిస్తామని చెప్పారు.
Also read
- నేటి జాతకములు 31 జూలై, 2026
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





