రైల్లో హిజ్రాలు రెచ్చిపోయారు. ఓ ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ. 10వేలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలులో సదురు ప్రయాణికుడి వద్ద డబ్బులు డిమాండ్ చేసిన వాళ్లు ఆపై అతని వద్ద పర్సు లాక్కున్నారు.
రైల్లో హిజ్రాలు రెచ్చిపోయారు. ఓ ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ. 10వేలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలులో సదురు ప్రయాణికుడి వద్ద డబ్బులు డిమాండ్ చేసిన వాళ్లు ఆపై అతని వద్ద పర్సు లాక్కున్నారు. అందులోని రూ.10 వేలు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఏంటీ దౌర్జన్యం అని ప్రశ్నిస్తే తోసేసి పరారయ్యారు
నలుగురు హిజ్రాలు అరెస్ట్
బాధితుడి ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ పోలీసులు నలుగురు హిజ్రాలను అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరికి చెందిన సూర్య భాను ప్రకాష్, జనగామకు చెందిన విజయ్, భద్రాద్రి కొత్తగూడెంకు జిల్లాలకు చెందిన సాయికుమార్తో పాటు మరో మైనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పది నెలల క్రితం సూరారంలో రహదారులపై భిక్షాటన చేసే వారని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా రైళ్లలో బలవంతంగా హిజ్రాలు ఇలా డబ్బులు లాక్కుంటున్నారని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు హెచ్చరించారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




