సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం, మల్కాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలను హత్య చేసి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అయితే భార్య తమను వదిలేసిపోయిందన్న మనస్తాపంతోనే అతని ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలను హత్య చేసి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం, మల్కాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్కాపూర్ గ్రామానికి చెందిన సుభాష్కు కొన్నెళ్ల క్రితం పెళ్లి జరిగింది. అతని ప్రస్తుతం మారిన్ (13), ఆరాధ్య (10) అనే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా భార్య కొన్ని రోజుల క్రితం వాళ్లను వదిలేసి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అయితే భార్యత తమను వదిలి వెళ్లిపోవడాన్ని సుభాష్ జీర్ణించుకోలేక పోయాడు. దీంతో మస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఇక మొదటగా తన ఇద్దరు కుమార్తెలను ఇంట్లోనే ఉరివేసి హత్య చేశాడు. ఆ తర్వాత తానూ కూడా ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి
Also read
- Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా..
- Andhra: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత.. అనంతపురంలో కలకలం
- August Festivals: శ్రావణ మాసం ఆరంభం.. వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణమి వరకు ఆగస్టులో ముఖ్య పండుగలు..
- Sankashtahara Chaturthi: సంకష్టహర చతుర్థి.. విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే మహత్తర వ్రతం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం.. 12 రాశులకు వారఫలాలు





