జగిత్యాల కోరుట్లలో రజిత అనే వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయ్యప్ప గుట్టపై మహిళ మృతదేహం కనిపించింది. పవన్ అనే వ్యక్తిని 6 నెలల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనే రజితను చంపినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. రజిత అనే వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జగిత్యాలో అయ్యప్ప గుట్టపై మహిళ మృతదేహం కనిపించింది. రజిత అనే మహిళ 6 నెలల కిందట పవన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పవన్ చంపాడని రజిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పవన్ను అదుపులోకి తీసుకున్నారు.
కావాలనే ప్లాన్ వేసి మరి..
పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం రాయ్బరేలీలో స్థానికంగా ఉండే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది
ఇందుకోసం వారు ఓ తుపాకీని కూడా వాడారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భార్య, ఆమె ప్రియుడు నిందితులని తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు
ఇటీవల పొలం పనుల కోసమని వెళ్లిన రూబీ ఎంతకు తిరిగి రాకపోవడంతో మనీష్ అనుమానంతో వెళ్లి చూడగా అక్కడ రూబీ, సునీల్లు అభ్యంతరకరమైన స్థితిలో కనిపించారు. దీంతో అక్కడే రూబీ,మనీష్ ల మధ్య గొడవ మొదలైంది. దీంతో తన వెంట తెచ్చుకున్న పిస్టల్తో సునీల్.. మనీష్ ను కాల్చి చంపేశాడు
Also read
- Jagannath Rath Yatra: భారతీయ కళాకారుల ప్రతిభకు నిదర్శనం జగన్నాథుని రథాలు.. ఎవరు? ఎలా తయారు చేస్తారో తెలుసా…?
- June 2025 Horoscope: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి మాసఫలాలు
- Sexual Assault: ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా – పోలీస్ స్టేషన్ మెస్లోనే రేప్!
- Ap Crime News: ఏపీలో అమానుషం.. బట్టలు ఊడదీసి స్తంభానికి కట్టేసి కొట్టారు!
- Maoist: మావోయిస్టుల కుట్ర భగ్నం.. జర్రయితే ప్రాణం పోతుండే.