జగిత్యాల కోరుట్లలో రజిత అనే వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయ్యప్ప గుట్టపై మహిళ మృతదేహం కనిపించింది. పవన్ అనే వ్యక్తిని 6 నెలల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనే రజితను చంపినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. రజిత అనే వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జగిత్యాలో అయ్యప్ప గుట్టపై మహిళ మృతదేహం కనిపించింది. రజిత అనే మహిళ 6 నెలల కిందట పవన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పవన్ చంపాడని రజిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పవన్ను అదుపులోకి తీసుకున్నారు.
కావాలనే ప్లాన్ వేసి మరి..
పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం రాయ్బరేలీలో స్థానికంగా ఉండే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది
ఇందుకోసం వారు ఓ తుపాకీని కూడా వాడారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భార్య, ఆమె ప్రియుడు నిందితులని తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు
ఇటీవల పొలం పనుల కోసమని వెళ్లిన రూబీ ఎంతకు తిరిగి రాకపోవడంతో మనీష్ అనుమానంతో వెళ్లి చూడగా అక్కడ రూబీ, సునీల్లు అభ్యంతరకరమైన స్థితిలో కనిపించారు. దీంతో అక్కడే రూబీ,మనీష్ ల మధ్య గొడవ మొదలైంది. దీంతో తన వెంట తెచ్చుకున్న పిస్టల్తో సునీల్.. మనీష్ ను కాల్చి చంపేశాడు
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





