అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన 71 సంవత్సరాల విశ్రాంత ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1.4 కోట్లు కాజేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
నర్సీపట్నం అర్బన్ : అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన 71 సంవత్సరాల విశ్రాంత ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1.4 కోట్లు కాజేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణ సీఐ జి.గోవిందరావు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘మీ ఎకౌంట్ కు సంబంధించి భారీ కుంభకోణం జరగడంతో డిజిటల్ అరెస్టు అయ్యారు’ అని సైబర్ నేరగాళ్లు తొలుత వృద్ధుణ్ని ఫోన్ లొ తీవ్రంగా బెదిరించారు. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే సొమ్ము చెల్లించాలనడంతో బాధితుడు బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లుగా దాచుకున్న నగదును విత్ట్ చేసి మరీ వారికి పంపించారు. మూడు రోజుల వ్యవధిలో ఆ మొత్తాన్ని నిందితులు చెప్పిన ఖాతాలకు జమ చేసేశారు. తరువాత తాను మోసపోయినట్టు గుర్తించి 12 రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి విజ్ఞప్తి మేరకు ఆయన పేరు, ఇతర వివరాలు వెల్లడించడం లేదని సీఐ తెలిపారు. వెంటనే అప్రమత్తమై బాధితుడు పంపిన కొంత నగదు విత్ డ్రా కాకుండా చూశామని, నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను పంపించామని తెలిపారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టులంటూ భయపెట్టినా, ఇతరత్రా బెదిరించినా వెంటనే 1930 నంబరును సంప్రదించాలన్నారు.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్కు వెళ్లింది.. కట్చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




