కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల మగ శిశువును మూటలో కట్టి కెనాల్ పక్కకు విసిరేసి వెళ్లారు.
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల మగ శిశువును మూటలో కట్టి కెనాల్ పక్కకు విసిరేసి వెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి సమీపంలోని కాకతీయ కెనాల్ పక్కన కొందరు ఓ పసికందును విసిరేశారు. అటువైపుగా వెళ్తున్న చొక్కారెడ్డి అనే రైతు పసికందు ఏడుపు విని దగ్గరకెళ్లి చూశాడు. కెనాల్ పక్కన ఓ మూటలో మగ శిశువు కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు శిశువును స్థానిక ఆసుపత్రికి తరలించారు. శిశువు జన్మించి మూడు రోజులు అవుతుందని, శిశువు శరీరంపై గాయాలు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. గుర్తు తెలియని మగ శిశువు లభ్యమైందని, ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ జీ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!