నగరంలోని రామలింగాపురం బ్రిడ్జి వద్ద రౌడీషీటర్ గుంజి రవి (40) దారుణహత్యకు గురయ్యాడు.
నెల్లూరు : నగరంలోని రామలింగాపురం బ్రిడ్జి వద్ద రౌడీషీటర్ గుంజి రవి (40) దారుణహత్యకు గురయ్యాడు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన రవి ఇటీవలే విడుదలయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో చింటూ, కమ్మసాయి, వెంకీడాన్తో పాటు మరికొందరు రవిని కత్తులతో పొడిచి హతమార్చారు. సమాచారం అందుకున్న బాలాజీ నగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Also read
- Telangana: ఇంతకాలం టైంపాస్కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
- మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
- స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!
- నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





