మార్కాపురం (ప్రకాశం) : తన కుమార్తెను వేధిస్తున్న యువకుడిని మరదలించాడన్న కోపంతో యువతి తండ్రిపై యువకుడు నలుగురితో కలిసి వచ్చి కత్తితో దాడి చేసిన ఘటన శనివారం మార్కాపురంలో జరిగింది. నాలి సత్యనారాయణ మార్కాపురంలోని నెహ్రూ బజార్లో సిమ్కార్డు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నారు. ఇంటర్మీడియట్ తన కుమార్తెను ఓ యువకుడు వేధిస్తుండటంతో అతడిని సత్యనారాయణ మందలించాడు. దీంతో ఆ యువకుడు తనతోపాటు మరో నలుగురిని రెండు బైక్లపై తీసుకొచ్చి యువతి తండ్రిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుండి వారంతా పారిపోయారు. దాడిని గమనించిన స్థానికులు వెంటనే సత్యనారాయణను ఆటోలో మార్కాపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ షేక్ మునాఫ్ ఆస్పత్రికి చేరుకొని బాధితుడి వద్ద నుండి వివరాలు సేకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Also read :
- రెండో తరగతి బాలికపై వృద్ధుడి అఘాయిత్యం
- రూ.25 లక్షలైనా ఇవ్వు, ఈ రాత్రికి ఇంటికైనా రా
- మొయినాబాద్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు.. రంగంలోకి సిట్, వారంతా బుక్కయినట్టే
- ఉగాది, శ్రీ పరాభవ నామ సంవత్సరం.. మీన రాశి ఫలితాలు!
- 2026 ఉగాది రాశిఫలాలు.. కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ.. ఆ సమస్యలు తప్పవు !





