SGSTV NEWS
Andhra PradeshCrime

Jagan Convoy: జగన్ కాన్వయ్ ఢీకొని వృద్ధుడు మృతి


మాజీ సీఎం జగన్‌ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్‌లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్‌పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.

మాజీ సీఎం జగన్‌ గుంటూరు పర్యటనలో అపశృతి నెలకొంది. ర్యాలీలో జగన్ కాన్వాయ్‌లోని ఒక కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా లాల్‌పురం హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జగన్ బుధవారం పల్నాడు జిల్లా పర్యటను వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.


అయితే జగన్ కాన్వాయ్‌ వెంట ఉన్న ఒక కారు లాల్‌పురం హైవే దగ్గర ఓ వృద్ధుడిని ఢీకొంది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం వృద్ధుడిని రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయారు. చివరికి స్థానికులు స్పందించి ఆ వృద్ధుడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మృతి చెందాడు. దీంతో వైసీపీ కార్యకర్తలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also read

Related posts

Share this