ప్రేమతో వారిద్దరి మనసులు కలిశాయి.. పెళ్లితో ఒక్కటయ్యారు.. జీవితాంతం ఒకరికొకరు తోడుండాలని భావించారు.. కానీ వీరి అన్యోన్యతను చూడలేకపోయిందేమో విధి.. హాయిగా సాగిపోతున్న దంపతుల బంధాన్ని చిదిమేసింది…
ప్రేమతో వారిద్దరి మనసులు కలిశాయి.. పెళ్లితో ఒక్కటయ్యారు.. జీవితాంతం ఒకరికొకరు తోడుండాలని భావించారు.. కానీ వీరి అన్యోన్యతను చూడలేకపోయిందేమో విధి.. హాయిగా సాగిపోతున్న దంపతుల బంధాన్ని చిదిమేసింది.. రోడ్డు ప్రమాద రూపంలో భర్తను విడదీసింది.. చేదువార్త విన్న ఆమె గుండె పగిలింది.. భర్తలేని లోకంలో నేనుండలేనంటూ తానూ వెళ్లిపోయింది.. ఈ హృదయ విదారక ఘటన లావేరు మండలంలో చోటుచేసుకుంది..
లావేరు మండలం కేశవరాయనపాలెం గ్రామానికి చెందిన నాయిని చంటి ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీ నందిగాంకు చెందిన భవానీ ప్రేమించుకొని ఏడాదిన్నర కిందట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చంటి దసరా రోజున ఉదయం అల్పాహారం తీసుకొచ్చేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మురపాక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే.. భర్త మరణవార్త విన్న భవానీ ఆదివారం ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స కోసం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందింది. ఈ ఘటనతో కేశవరాయనపాలెం గ్రామం విషాదంలో మునిగిపోయింది. భవాని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. లావేరు పోలీసులు ఈ ఘటనలపై వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- మస్కిటో కాయిల్ అంటుకొని చనిపోయాడా..? అర్థరాత్రి ఇంకేమైనా జరిగిందా..
- రెండేళ్ల తర్వాత పగ.. పక్కా స్కెచ్తో ఉపాధ్యాయుడిపై విద్యార్థి దాడి
- తండ్రిని ఆటో ఎక్కించాడు.. బైక్పై ఇంటికి బయల్దేరగా.. ఇంతలో.!
- పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు ఆ గ్రామంలో ఏం జరిగిందంటే?
- మూఢనమ్మకం చిదిమిన ప్రాణం.. మంత్రాల నెపంతో పూజారి దారుణ హత్య..!





