నడిరోడ్డుపై తాగుబోతు చేసిన పనితో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అందరూ అతడిని ఫోటోలు, వీడియోలు తీసి నెట్టింట వైరల్గా మార్చేశారు. దాంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒళ్లు తెలియకుండా ఫుల్గా మద్యం తాగిన అతడు..మందు మైకంలో నాకెవరు అడ్డు చెప్పేది.. నన్ను ఎవరు ఆపేది అన్నట్టుగా నడి రోడ్డుపై స్కూటీని పడేశాడు. అలాగే, గుర్రుపెట్టి నిద్రపోయాడు.
మందుబాబులా మజాకా.. తాగిన మందు నషాళానికి ఎక్కిన తరువాత వాళ్లు చేసే రచ్చ మామూలుగా ఉండదు. కొందరు తాగేసి గొడవలు సృష్టిస్తారు. మరికొందరు ఎత్తైన టవర్లు, స్తంబాలు ఎక్కేస్తుంటారు. మరికొందరు ప్రమాదాల బారినపడుతుంటారు. ఇంకొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇక విజయవాడలో నడి రోడ్డుపై ఓ మందుబాబు చేసిన రచ్చ ఎలా ఉందంటే.. ఫుటుగా తాగేసిన అతడు..తన స్కూటీని అక్కడే వదిలేసి నడిరోడ్డుపైనే హాయిగా గుర్రుపెడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ ఘటన విజయవాడలోని శ్రీనగర్ కాలనీలో జరిగింది. నడిరోడ్డుపై తాగుబోతు చేసిన పనితో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అందరూ అతడిని ఫోటోలు, వీడియోలు తీసి నెట్టింట వైరల్గా మార్చేశారు. దాంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒళ్లు తెలియకుండా ఫుల్గా మద్యం తాగిన అతడు..మందు మైకంలో నాకెవరు అడ్డు చెప్పేది.. నన్ను ఎవరు ఆపేది అన్నట్టుగా నడి రోడ్డుపై స్కూటీని పడేశాడు. అలాగే, గుర్రుపెట్టి నిద్రపోయాడు. అటు, ఇటుగా ఎన్ని వాహనాలు రోడ్డుపై వెళ్తున్న అతని నిద్రకు మాత్రం భంగం కలగలేదు
వీడియో ఇక్కడ చూడండి..
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





