విశాఖపట్నం: నగరంలోని అక్కయ్యపాలెం పరిధిలో మహిళ దారుణహత్యకు గురయ్యారు. శ్రీనివాసనగర్లో బంగారు ఆభరణాల కోసం పార్వతి (50) అనే మహిళను దుండగులు చంపేశారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బీరువా తాళాల కోసం మహిళను చిత్రహింసలు పెట్టారు. లాకర్ పగలగొట్టి అందులోని బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఘటనాస్థలికి ఏసీపీ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని పరిశీలించారు. బుధవారమే పార్వతి హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చినట్లు గుర్తించారు.
Also read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





