విశాఖపట్నం: నగరంలోని అక్కయ్యపాలెం పరిధిలో మహిళ దారుణహత్యకు గురయ్యారు. శ్రీనివాసనగర్లో బంగారు ఆభరణాల కోసం పార్వతి (50) అనే మహిళను దుండగులు చంపేశారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బీరువా తాళాల కోసం మహిళను చిత్రహింసలు పెట్టారు. లాకర్ పగలగొట్టి అందులోని బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఘటనాస్థలికి ఏసీపీ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని పరిశీలించారు. బుధవారమే పార్వతి హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చినట్లు గుర్తించారు.
Also read
- ఘోరం.. కన్నతల్లిని బండరాయితో కొట్టి చంపి.. కొడుకు ఆత్మహత్య! కారణం అదేనా?
- Telangana: ఇంటికి తాళం వేసి కాశీ వెళ్లిన ఓనర్స్.. మార్నింగ్ పనిమనిషి వచ్చి చూడగా..
- Hyderabad: కామంతో రెచ్చిపోయాడు.. కట్చేస్తే.. ఊహించని ట్విస్ట్..
- అమానుషం…చోరీ నెపంతో ఎనిమిదేళ్ల బాలికపై చిత్రహింసలు, అట్లకాడతో వాతలు..
- Rajanagaram: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి





