SGSTV NEWS online
Andhra PradeshCrime

బంగారం కోసం చేతులు, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణహత్య



విశాఖపట్నం: నగరంలోని అక్కయ్యపాలెం పరిధిలో మహిళ దారుణహత్యకు గురయ్యారు. శ్రీనివాసనగర్లో బంగారు ఆభరణాల కోసం పార్వతి (50) అనే మహిళను దుండగులు చంపేశారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బీరువా తాళాల కోసం మహిళను చిత్రహింసలు పెట్టారు. లాకర్ పగలగొట్టి అందులోని బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఘటనాస్థలికి ఏసీపీ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని పరిశీలించారు. బుధవారమే పార్వతి హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చినట్లు గుర్తించారు.

Also read

Related posts