కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిలిపితీయా ఇంద్రజిత్ సింగ్ (28) ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను బయటకు పంపివేసి గదిలోకి వెళ్లాడు. తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ఛాతీపై కాల్చుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
భర్త మరణవార్త విని తట్టుకోలేకపోయిన ఇంద్రజిత్ సింగ్ భార్య తీవ్ర మనస్తాపంతో గ్రామ సమీపంలోని కుడికుంటలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడు కాల్చుకున్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు లింగంపేట ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





