కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిలిపితీయా ఇంద్రజిత్ సింగ్ (28) ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను బయటకు పంపివేసి గదిలోకి వెళ్లాడు. తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ఛాతీపై కాల్చుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
భర్త మరణవార్త విని తట్టుకోలేకపోయిన ఇంద్రజిత్ సింగ్ భార్య తీవ్ర మనస్తాపంతో గ్రామ సమీపంలోని కుడికుంటలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడు కాల్చుకున్న నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు లింగంపేట ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు.
Also read
- Astrology: శని అమావాస్యలో శక్తివంతమైన రాజయోగం! 5 రాశులకు డబుల్ జాక్పాట్ అదృష్టం.. వరదలా డబ్బు!
- తిరుమలలో మోసం గుట్టురట్టు: మహిళా జర్నలిస్టు ఫిర్యాదుతో దళారీ చిక్కాడు
- లేడీస్ హాస్టల్ భవనంపై మృతదేహం.. గుంటూరుజిల్లాకు చెందిన మహిళగా గుర్తింపు
- ప్రేమజంట పెళ్లి వ్యవహారం.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
- బంగారం కోసం చేతులు, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణహత్య





