SGSTV NEWS online
Andhra PradeshCrime

ప్రేమజంట పెళ్లి వ్యవహారం.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ


భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ పి.నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ ప్రేమ జంట పెళ్లి వ్యవహారంలో ఎస్ఐ బెదిరించి రూ.70 వేలు లంచం అడిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో.. గురువారం లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు చేస్తున్నారు.

Also read

Related posts