హైదరాబాద్: పంజాగుట్ట డివిజన్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది మధురానగర్లోని భార్గవి లేడీస్ హాస్టల్ భవనం సైభాగంలో ఉన్న టెర్రస్లో నివసిస్తున్న హారిక (40) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. టెర్రస్ పై ఉన్న బాత్రూంలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మధురానగర్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హారిక మృతి చెంది రెండు రోజులు అయి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతురాలి స్వస్థలం గుంటూరు జిల్లాగా గుర్తించారు. టెర్రస్ పై ఒంటరిగా నివసిస్తున్న హారిక బాత్రూంలో పడిపోయి మృతి చెందినట్టుగా అనుమానిస్తున్న పోలీసులు, అసలు కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also read
- Astrology: శని అమావాస్యలో శక్తివంతమైన రాజయోగం! 5 రాశులకు డబుల్ జాక్పాట్ అదృష్టం.. వరదలా డబ్బు!
- తిరుమలలో మోసం గుట్టురట్టు: మహిళా జర్నలిస్టు ఫిర్యాదుతో దళారీ చిక్కాడు
- లేడీస్ హాస్టల్ భవనంపై మృతదేహం.. గుంటూరుజిల్లాకు చెందిన మహిళగా గుర్తింపు
- ప్రేమజంట పెళ్లి వ్యవహారం.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
- బంగారం కోసం చేతులు, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణహత్య





