SGSTV NEWS online
Andhra PradeshCrime

జెండా ఉత్సవాల్లో ముగ్గురు యువకులకు కత్తిపోట్లు

రౌడీలు పోకిరీలకు అడ్డాగా మారిపోయిన గూడూరు పట్టణం

తిరుపతి సిటీ : తిరుపతి జిల్లా గూడూరులో జరిగిన ఆంజనేయస్వామి జెండా ఉత్సవంలో పోకిరీల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పట్టణంలో పలు చోట్ల అర్థరాత్రిలో జండాల ఉత్సవాల్లో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు యువకులను ప్రత్యర్ధులు కత్తులతో పొడిచారు. ఈ కత్తి పొట్లలో యశ్వంత్, హరీష్ అబ్దుల్ అనే యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు. కత్తిపోట్లకు గురైన యువకులకు, నిందితులకు మధ్య పాత కక్షలు ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also read

Related posts