స్వేచ్ఛ మృతిపై ప్రియుడు పూర్ణ చందర్ స్పందించాడు. స్వేచ్ఛను చావుకు తాను కారణం కాదంటూ లేఖ విడుదల చేశాడు. ఆమె తల్లిదండ్రుల కారణంగానే ఆమె చనిపోయిందన్నాడు.
Swetcha: స్వేచ్ఛ మృతిపై ప్రియుడు పూర్ణ చందర్ స్పందించాడు. స్వేచ్ఛను చావుకు తాను కారణం కాదంటూ లేఖ విడుదల చేశాడు. ఆమె తల్లిదండ్రుల కారణంగానే ఆమె చనిపోయిందని, తండ్రి గత రెండు రోజులకింద ఆమెను తిట్టడంవల్లే మనస్థాపానికిగురై ఆత్మహత్యకు పాల్పడిందని లేఖలో పేర్కొన్నాడు. తనను భర్తగా పరిచయడం చేయడం స్వేచ్ఛ తండ్రికి నచ్చలేదని, దీంతో తన పరువు పోతుందంటూ గాయపరిచేలా మాట్లాడటంతో స్వేచ్ఛ తట్టకోలేక ఉరేసుకుందని వివరించాడు.
ఇక పాప అరణ్యను తాను బాగా చూసుకున్నానని, వారిద్దరికీ ఎలాంటి లోటు లేకుండా సంతోషపెట్టానని చెప్పాడు. గత రెండు పెళ్లీలు చేసుకున్న స్వేచ్ఛ చాలా కాలంగా డిప్రెషన్ లో ఉంటుందని, తన మానసికస్థితిని తానే సాధారణ స్థాయికి తీసుకొచ్చానన్నాడు. రూ.5 లక్షలు ఖర్చు చేసి అరణ్య ఆఫ్ శారీ ఫంక్షన్ చేశానని, అరణ్య చదువుకయ్యే ఖర్చులు తానే భరిస్తున్నట్లు తెలిపాడు.
Also read
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..
- వేసిన తాళం వేసినట్టే ఉంచి.. డబ్బు, బంగారం కాజేస్తున్న కేటుగాళ్లు
- మానవత్వం మరిచిన భర్త..! భార్యపై పెట్రోల్ పోసి నిప్పు.. అడ్డొచ్చిన తల్లికీ గాయాలు..!
- వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
- ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు.. విచారణలో వెలుగులోకి సంచలనాలు!





