గుంటూర్ జిల్లాలో మరో రైలు దోపిడి ప్రయత్నం జరిగింది. పిడుగురాళ్ల తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ ప్రెస్లో కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నించారు
Train: గుంటూర్ జిల్లాలో మరో రైలు దోపిడి ప్రయత్నం జరిగింది. పిడుగురాళ్ల తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ ప్రెస్లో కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు దొంగలపై కాల్పులు జరిపిపారు. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడినుంచి పారిపోయారు.
వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా దొరకుండా పారిపోవడంతో వారికోసం గాలిస్తున్నారు. వరుసగా రైళ్ళలో చోరికి పాల్పడుతున్న వారిని బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్ లుగా అనుమానిస్తున్నారు. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నట్లు గుర్తించారు. వారం రోజుల్లో రెండుసార్లు తెల్లవారుజామునే చోరికి పాల్పడేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
Also read
- సూర్య గోచారం.. 12 రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనున్నదంటే?
- June Amavasya 2026: అమావాస్య నుంచి వీరికి మహర్దశ..! ఇందులో మీ రాశి ఉందా..?
- చెన్నూరు SBI గోల్డ్ చోరీ కేసు సుఖాంతం.. ఎట్టకేలకు బంగారం తిరిగి అందజేసిన బ్యాంక్
- రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగ బాబు.. బాలెనో కారులో వచ్చి చోరీలు!
- 9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి జీవిత ఖైదు!





