ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం ఊటుకూరు గ్రామంలో పోసిన బాలకోటయ్య (52) శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలు నేపథ్యంలో ప్రత్యర్థులు పట్టపగలు నడిరోడ్డుపై బాలకోటయ్యను మారణ ఆయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. కైకలూరు సిఐ కృష్ణ కిషోర్, మండపల్లి ఎస్ఐ రాంబాబు, ముదినేపల్లి ఎస్ఐ డి.వెంకట కుమార్ ఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడు చైతన్య ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కృష్ణ కిషోర్ తెలిపారు. బాలకోటయ్య హత్య గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేసింది.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





