మొబైల్ పోయిందని పోలీస్ స్టేషన్కు వెళ్లిన వ్యక్తిని అక్కడి కానిస్టేబుల్ కొట్టి పంపించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాధితుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అల్లాదుర్గం: మొబైల్ పోయిందని పోలీస్ స్టేషన్కు వెళ్లిన వ్యక్తిని అక్కడి కానిస్టేబుల్ కొట్టి పంపించాడు. దీంతో మనస్తాపానికి గురైన బాధితుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో జరిగింది. రాంపుర్ గ్రామానికి చెందిన తలారి కిషన్ (33) మొబైల్ ఈ నెల 5న తన గ్రామంలోనే పోయింది. అదే రోజు రాత్రి అల్లాదుర్గం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సాయిలు బాధితుడిని కొట్టి పంపించాడు.
తిరిగి 6న మళ్లీ స్టేషన్కు వెళ్లగా.. అక్కడి పోలీసులు దుర్భాషలాడి తిట్టి మళ్లీ తిరిగి పంపించారు. దీంతో మనస్తాపానికి గురైన కిషన్ స్థానిక ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. మృతికి కారణమైన కానిస్టేబుల్ సాయిలుని వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పినట్లు స్థానికులు తెలిపారు.
Also read
- ఇంకా దొరకని రాము.. నీతు.. గుండెల్ని పిండేస్తున్న ఘటన..
- Massive Scam: 70 మందికి టోకరా పెట్టిన రిటైర్డ్ టీచర్.. ఏకంగా ఏడు కోట్లు స్వాహా
- చోరీ చేసిన 15 రోజుల తర్వాత సొత్తు తిరిగి ఇచ్చిన దొంగలు.. కానీ వాటిని మాత్రం ఇవ్వలేమంటూ లెటర్
- నాయనమ్మ అంత్యక్రియలు ముగిశాయి.. కానీ, బంగారం మాయమైంది.. చిన్న అనుమానంతో ఆరాతీస్తే..
- దేవతల చేతుల్లో “త్రిశూలం” ఎందుకు? – ఇది దేనికి సంకేతం?






Kolkata: కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. అలా ఎలా చేస్తారంటూ..